‘గాలేరు-నగిరి’ సాధనకు రోజా పాదయాత్ర

Published : Nov 28, 2017, 05:31 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
‘గాలేరు-నగిరి’ సాధనకు రోజా పాదయాత్ర

సారాంశం

పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా నాలుగు రోజులు పాదయాత్ర చేయనున్న రోజా

గాలేరు-నగిరి సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మంగళవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాలు తాగునీరు, సాగునీటి కోసం గాలేరు-నగిరి ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు.

ప్రాజెక్టు కోసం చేపడుతున్న పాదయాత్ర నగరిలోని సత్రవాడ నుంచి ప్రారంభమై తిరుమల వరకు సాగుతుందని వెల్లడించారు. డిసెంబరు 2వ తేదీ శ్రీవారిని దర్శించుకుని ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రార్థిస్తామన్నారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. పాదయాత్రలో పార్టీ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu