రెడ్ మీ నోట్4 ధర తగ్గింది..!

Published : Nov 13, 2017, 05:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
రెడ్ మీ నోట్4 ధర తగ్గింది..!

సారాంశం

ధర తగ్గిన రెడ్ మీ నోట్ 4 రూ.1000 తగ్గించిన కంపెనీ

చైనా కంపెనీకి చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ. ఈ కంపెనీ తన రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఈ ఫోన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ధరలో అందరికీ అందుబాటులో ఉండే ఈ ఫోన్ ధరను మరో రూ.1000 తగ్గించింది. ఈ విషయాన్ని భారత్ లోని షియోమీ కంపెనీ హెడ్ మను కుమార్ జైన్ తెలిపారు. ఈ ఫోన్ ని తొలుత విడుదల చేసిన సమయంలోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తాజాగా మరో రూ.1000 తగ్గించడంతో మరింత ఎక్కువగా అమ్ముడయ్యే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు.

రెడ్‌మీ నోట్‌4 3జీబీ ర్యామ్‌/32జీబీ వేరియంట్‌  ఫోన్ ధర రూ10,999, 4జీబీ ర్యామ్‌/64జీబీ వేరియంట్‌ రూ.12,999 ఉండగా.. రెండు వేరియంట్లపై చెరో వెయ్యి రూపాయలు తగ్గింది. ఎంఐ.కామ్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సైట్లలో కూడా తగ్గింపు ధరకే ఈ ఫోన్‌ లభిస్తోంది. దీనికి తోడు ఫ్లిప్‌కార్టులో ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజీ ఆఫర్లతో పాటు, క్రెడిట్‌ కార్డు కొనుగోలుపై ఆఫర్లు ఉన్నాయి. తమ పాత ఫోన్‌ను మార్చుకునే వారికి రూ.11వేలు వరకు ఎక్ఛేంజీ సదుపాయాన్ని ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తుండగా.. యాక్సిస్‌బ్యాంక్‌ బజ్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. వడ్డీలేని ఈఎంఐ సదుపాయాన్ని కూడా కొనుగోలుదారులకు కల్పిస్తోంది.

రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు..

5.50 ఇంచెస్ టచ్ స్క్రీన్

4జీబీ ర్యామ్

64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ

ఫ్రంట్ కెమేరా 5మెగా పిక్సెల్

వెనుక కెమేరా 13మెగా పిక్సెల్

ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu