NEWS
చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. భారత మార్కెట్లోకి టీవీని విడుదల చేసింది. ప్రేమికుల దినోత్సవం సందర్భాంగా షియోమి రెడ్ మీ నోట్ 5, రెడ్ మీ నోట్ 5 ప్రో ఫోన్లను విడుల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఫోన్లతో పాటు ఒక టీవీని కూడా ప్రవేశపెట్టింది. ఎంఐ టీవీ4 పేరిట ప్రవేశపెట్టిన ఈ టీవీలో హెచ్డీఆర్ సపోర్ట్ ఉన్న అధునాతన 4కె ప్యానెల్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఈ టీవీలో కనిపించే దృశ్యాలు అత్యంత క్వాలిటీతో ఉంటాయి. ఇక ఈ టీవీతోపాటు స్మార్ట్ రిమోట్ను కూడా అందిస్తున్నారు. దీని ద్వారా సెట్ టాప్ బాక్స్ ను కూడా ఆపరేట్ చేసుకోవచ్చు.
షియోమీ ఎంఐ టీవీ4లో 55 ఇంచ్ 4కె డిస్ప్లే, 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ టీవీ ఓఎస్, వైఫై, బ్లూటూత్ 4.0 ఎల్ఈ, హెచ్డీఎంఐ, ఈథర్నెట్ పోర్టులు వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.39,999 ధరకు ఈ టీవీ ఫ్లిప్కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్ లో వినియోగదారులకు ఈ నెల 22వ తేదీ నుంచి లభ్యం కానుంది. టీవీని కొన్నవారికి 3 నెలల పాటు సోనీ లైవ్, హంగామా యాప్లలో ఉచిత సబ్స్క్రిప్షన్ను అందివ్వనున్నారు. అలాగే ఉచిత ఇన్స్టాలేషన్, ఉచిత ఎంఐ ఐఆర్ కేబుల్ను అందిస్తున్నారు.