కెసిఆర్ కు ఉపరాష్ట్రపతి అభినందనలు

Published : Sep 13, 2017, 12:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
కెసిఆర్ కు ఉపరాష్ట్రపతి అభినందనలు

సారాంశం

తెలంగాణలో  తెలుగు పాఠ్యాంశం తప్పనిసరిచేసినందుకు ముఖ్యమంత్రికి ఉపరాష్ట్రపతి అభినందనలు

ముఖ్యమంత్రి కెసిఆర్ తెలుగును ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలకు ప్రశంసలందుతున్నాయి. ఉపరాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు నుంచి తొలి  అభినందనలు అందాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాష బోధనను తప్పనిసరి చేయాలని  నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  ఈ నిర్ణయం పట్ల  కెసిఆర్‌కు అభినందనలు తెలుపుతూ వెంకయ్య ట్వీట్ చేశారు.  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తాను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తూ  మాతృభాషకు  ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !