
భారత మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్యాగ్ బ్యాటింగ్ మిస్ అవుతున్నారా... అయితే మీకు ఓ గుడ్ న్యూస్ వీరు మళ్లీ బ్యాట్ పట్టబోతున్నాడు. అంటే మళ్లీ భారత జట్టులో, లేకుంటే ఐపీఎల్ లోకి వస్తున్నాడా..? అని అనుమానం కల్గుతుంది కదా.. అదేం లేదండి. మరి ఎలా అనుకుంటున్నారు కదా..!
ఈ ఎడాది డిసెంబర్ 21 నుంచి 24 మధ్య యూఏఈలోని షార్జాలో టెన్పీఎల్ సీజన్ -2 లీగ్ జరగనుంది. ఈ టోర్నీలో సెహ్వాగ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు. సెహ్వాగ్ ఒక్కడే కాదు ఈ టెన్పీఎల్ లో విద్వంసకర ఆటగాళ్లు అఫ్రిదీ, క్రిస్ గేల్, సంగక్కర తదితర ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నారు.
మొత్తం 20 జట్లు ఈ రెండవ సీజన్ లో పాల్గోనబోతున్నాయి. భారతదేశం నుండి మరాఠాస్, పంజాబీస్, కేరళిటీస్ మూడు జట్లు పాల్గోంటున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా బంగ్లాస్, లంకన్స్, సింధీస్, ఫఖ్తూన్స్ పాటు పలు జట్లు ఈ టోర్నీలో ఆడనున్నాయి. టీ20 తరహాలోనే టెన్పీఎల్ మ్యాచులు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.