ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు

First Published Aug 11, 2017, 11:17 AM IST
Highlights
  • ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.
  • రాష్ట్ర పతి భవన్ లోని దర్బార్ హాల్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు.

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర పతి భవన్ లోని దర్బార్ హాల్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్రమంత్రులు, ఎన్డీయే ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తదితరులు   హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముందు.. వెంకయ్యనాయుడు  రాజ్ ఘాట్ ని సందర్శించి..మహాత్మాగాంధీ సమాధి  వద్ద నివాళులర్పించారు. అనంతరం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ విగ్రహాల వద్ద కూడా నివాళులర్పించారు.

click me!