
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు నెలలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒకటో తేదీ నుంచి 26వ తేదీ వరకు గల విశేష పర్వదినాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆగస్టు 1 వ తేది మతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి.
ఆగస్టు 3 నుండి 5 వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు.
ఆగస్టు 4 వ తేది ఛత్రస్నాపనోత్సవం, తులసీ మహత్మ్యం.
ఆగస్టు 6 వ తేది శ్రీ ఆళవందార్ వర్ష తిరునక్షత్రం.
ఆగస్టు 7 వ తేది శ్రావణ పౌర్ణమి, చంద్రగ్రహణం, హయగ్రీవజయంతి, శ్రీ విఖనస జయంతి.
ఆగస్టు 8 వ తేది శ్రీవారు శ్రీవిఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేయుట.
ఆగస్టు 15 వ తేది గోకులాష్టమి ఆస్థానం.
ఆగస్టు 16 వ తేది ఉట్లోత్సవం.
ఆగస్టు 23 వ తేది శ్రీ బలరామ జయంతి.
ఆగస్టు 24 వ తేది శ్రీ వరాహ జయంతి.
ఆగస్టు 26 వ తేది ఋషిపంచమి.
* నిన్న స్వామివారి ఆలయానికి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం ₹:2.34కోట్లు.