NEWS
న్యూయార్క్ లోని ట్రంప్ టవర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. న్యూయార్క్ సిటీ అగ్నిమాపక విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా.. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ సభ్యులెవరూ కూడా ఈ భవంతిలో లేరని అగ్నిమాపక కమిషనరు డేనియల్ నిగ్రో వెల్లడించారు. 50 వ అంతస్తులో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలిపారు. ట్రంప్ టవర్లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయనీ....అగ్నిమాపక సిబ్బంది కృషికి అభినందనలు అంటూ అధ్యక్షుడు ట్రంప్ ఆ తర్వాత ట్వీట్చేశారు. కాగా.. మంటలు అదుపుచేయడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బందిలో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.