రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ మృతి

Published : Apr 05, 2018, 06:29 PM ISTUpdated : Apr 05, 2018, 10:54 PM IST
రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ మృతి

సారాంశం

ప్రమాదంలో పీఏ భార్య కూడా మృతి

మెదక్  జిల్లాప్రజ్ఞాపూర్  సమీపంలో రాజీవ్ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  రోడ్డు పక్కన ఆగివున్న లారీని వెనుక వైపు నుండి వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పీఏ బాల గంగాధర్ అతని భార్య విజయ మృతి చెందారు. కారు పూర్తిగా లారీ కింద ఇరుక్కుపోవడంతో మృతదేహాలు కూడా అందులోనే చిక్కుకున్నాయి. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బైటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కట్టర్ ల సాయంతో కారు ను కట్ చేసి మృతదేహాలను బైటికి తీయడానికి పోలీసులు శ్రమిస్తున్నారు. కారుతో పాటు కారులోని శవాలు కూడా నుజ్జు నుజ్జు అయిపోవడంతో బైటికి తీయడానికి సమయం పడుతోంది. ఈ దంపతులు హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.


 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu