రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ మృతి

First Published Apr 5, 2018, 6:29 PM IST
Highlights
ప్రమాదంలో పీఏ భార్య కూడా మృతి

మెదక్  జిల్లాప్రజ్ఞాపూర్  సమీపంలో రాజీవ్ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  రోడ్డు పక్కన ఆగివున్న లారీని వెనుక వైపు నుండి వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పీఏ బాల గంగాధర్ అతని భార్య విజయ మృతి చెందారు. కారు పూర్తిగా లారీ కింద ఇరుక్కుపోవడంతో మృతదేహాలు కూడా అందులోనే చిక్కుకున్నాయి. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బైటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కట్టర్ ల సాయంతో కారు ను కట్ చేసి మృతదేహాలను బైటికి తీయడానికి పోలీసులు శ్రమిస్తున్నారు. కారుతో పాటు కారులోని శవాలు కూడా నుజ్జు నుజ్జు అయిపోవడంతో బైటికి తీయడానికి సమయం పడుతోంది. ఈ దంపతులు హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.


 

click me!