మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన 18 ఏళ్ల యువకుడు

Published : Apr 05, 2018, 04:22 PM ISTUpdated : Apr 05, 2018, 04:28 PM IST
మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన 18 ఏళ్ల యువకుడు

సారాంశం

విషయం బైటపడకుండా చిన్నారిని చంపే ప్రయత్నం

అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలో చోటుచేసుకుంది. పాపం చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపించిన యువకుడు ఇంట్లోకి తీసుకెళ్లి అత్చాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఈ విషయాన్ని బైట పెడితే తన పరువు పోతుందని భావించి చిన్నారిని హతమార్చడానికి ప్రయత్నించాడు. అయితే  ఏడుపు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని చిన్నారిని కాపాడారు. 

ఈ అఘాయిత్యానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యూపిలోని రాంపూర్‌కు చెందిన ఓ 18 ఏళ్ల యువకుడు తన  పొరుగింట్లో ఉండే మూడేళ్ల చిన్నారిపై
కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఇంట్లోకి పిలిచాడు. అనంతరం చిన్నారిపై  పైశాచికంగా లైంగిక దాడి చేశాడు. ఈ వికృత చేష్టలకు భయకంపితురాలైన చిన్నారి ఏడవటం మొదలుపెట్టింది. దీంతో తాను చేసిన ఈ నీచపు పని ఎక్కడ బైటపడుతుందోనని పాపను హతమార్చడానికి ప్రయత్నించాడు. గాలి ఆడకుండా ఉండే ఓ చిన్న డబ్బాలో పాపను కుక్కి తాళం వేసి అక్కడినుండి పరారయ్యాడు. అయితే యువకుడి ఇంట్లోంచి పాప ఏడుపు వినబడటంతో ఇంట్లోకి ప్రవేశించిన స్థానికులు డబ్బాలోంచితీసి పాపను కాపాడారు.  

ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అభం శుభం తెలియని తమ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను కోరారు.
 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu