NEWS
గణేష్ నిమజ్జనానికి అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే నిమజ్జనానికి 4 వేల వాహనాలను అందజేయనున్నట్లు గ్రేటర్ రవాణాశాఖ అధికారి పాండురంగనాయక్ తెలిపారు. దీని కోసం గ్రేటర్ వ్యాప్తంగా 12 పూలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ విషయమై గణేష్ ఉత్సవ కమిటీ, ట్రాఫిక్ పోలీసులతో గ్రేటర్ రవాణా శాఖ అధికారులు చర్చలు జరిపారు.
వాహనాల సమీకరణ కోసం నగర వ్యాప్తంగా పూలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి.. ఒక్కో పూలింగ్ స్టేషన్కు ఒక్కోరవాణా అధికారిని నియమించినట్లు తెలిపారు. ఆ పూలింగ్ స్టేషన్ బాధ్యత అంతా ఆ అధికారిపై నే ఉంటుందని ఆయన వివరించారు.
సికింద్రాబాద్ పూలింగ్ స్టేషన్ - ఆర్టీవో వెంకటరమణ, నాగోల్- ఎంవీఐ ప్రసాద్ రెడ్డి, జూపార్క్- పురుషోత్తం, మోహదీపట్నం- ఆర్టీవో సి.రమేష్, మన్నెగూడ- ఎంవీఐ బలరాం, నెక్లెస్ రోడ్- ఎంవీఐ ఎ
శ్రీనివాస్, మేడ్చల్- ఎంవీఐ కిషన్, చంపాపేట్- ఎంవీఐ లక్ష్మణ్, మలక్ పేట్ ఆర్టీవో మోయిన్, పటాన్ చెరు ఎంవీఐ రాజ్ మహ్మద్, ఆటోనగర్ ఎంవీఐ గోవర్థన్ రెడ్డి, గచ్చిబౌలి - ఎంవీఐ సాయిరాంరెడ్డి లకు అప్పగించారు.