ఆగస్టు7న శ్రీవారి దర్శనం బంద్

Published : Jul 29, 2017, 11:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఆగస్టు7న శ్రీవారి దర్శనం బంద్

సారాంశం

చంద్రగ్రహణం కారణంగా  దేవస్థానాన్ని మూసివేయనున్నారు అష్టదళ పాదపద్మారాధన సేవల అనంతరం స్వా మి దర్శనం  

 

చంద్రగ్రహణం కారణంగా  తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆగస్టు 7వ తేదీన మూసివేయనున్నారు. చంద్రగ్రహణం 7వ తేదీ రాత్రి 10.52 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12.48 గంటలకు పూర్తి అవుతుంది. దీంతో స్వామి వారి మందిరాన్ని 7న సాయంత్రం 4.30 నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటల వరకు మూసివేయనున్నారు. తిరిగి 8వ తేదీ వేకువ జామున ఆలయ తలుపులు తెరచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల అనంతరం ఉదయం 7 గంటలకు స్వామి దర్శనానికి అనుమతిస్తారు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu