తల్లిపాలు తాగి చిన్నారి మృతి

Published : Dec 28, 2017, 11:29 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
తల్లిపాలు తాగి చిన్నారి మృతి

సారాంశం

తల్లిపాలు తాగి మృతిచెందిన  చిన్నారి

పుట్టిన ప్రతి బిడ్డ.. తల్లిపాలు తాగి తన ఆకలిని తీర్చుకుంటుంది. కానీ.. ఓ బిడ్డ మాత్రం.. కేవలం తల్లిపాలు తాగినందుకే మృత్యువాతపడింది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

అసలేం జరిగిందంటే.. మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామానికి చెందిన కడారి మల్లయ్య అనే వ్యక్తి ఈ నెల 25వ తేదీ రాత్రి మద్యం మత్తులో పురుగుమందు తాగడానికి ప్రయత్నించాడు. గమనించిన ఆయన భార్య లక్ష్మీదేవి వారించింది. ఈ ప్రయత్నంలో పురుగు మందు లక్ష్మీదేవి ఛాతీపై పడింది. దీన్ని గమనించకుండా లక్ష్మీదేవి అదే రోజు తన కూతురు ప్రణీతకు పాలు ఇచ్చింది. విషంతో కూడిన ఆ పాలు తాగిన చిన్నారి ప్రణీత అస్వస్థతకు గురైంది. వెంటనే చిన్నారిని చికిత్సకోసం హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం పాప మరణించింది. దీంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu