బంగారం కొనుగోళుదారులకు శుభవార్త

Published : Feb 14, 2017, 11:08 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
బంగారం కొనుగోళుదారులకు శుభవార్త

సారాంశం

భారీగా తగ్గిన ధర

గత కొన్నాళ్లుగా బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. వెండి ధర కూడా అదే బాటలో నడుస్తోంది.

 

వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర  ఈ రోజు భారీగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.300 తగ్గింది.

 

ప్రస్తుతం  10 గ్రాముల ధర  రూ.29,650 గా నమోదైంది. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా తగ్గడం కారణంగా ధర తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

 

మరో వైపు వెండి ధర కూడా  కొద్దిగా తగ్గింది.  ఈ రోజు కిలో వెండి ధర రూ.100 తగ్గింది. కిలో ధర రూ.42,900 కు  చేరింది.

 

అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్సుకు 0.67శాతం తగ్గి 1,224.70 డాలర్లు పలకగా, వెండి 0.78శాతం తగ్గి ఔన్సు 17.80 డాలర్లగా నమోదైంది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu