రెడ్ మీ నోట్5 సేల్ ప్రారంభం... ఫీచర్లు అదిరిపోయాయి

Published : Feb 22, 2018, 12:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
రెడ్ మీ నోట్5 సేల్ ప్రారంభం... ఫీచర్లు అదిరిపోయాయి

సారాంశం

షియోమి నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు రెడ్ మీ నోట్5, రెడ్ మీ నోట్ 5 ప్రో సేల్ ప్రారంభం

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. ఇటీవల రెడ్ మీ నోట్5, రెడ్ మీ నోట్ 5 ప్రో ఫోన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ రెండు ఫోన్లు గురువారం నుంచి వినియోగదారులకు లభ్యమౌతున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్ల సేల్ ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభమైంది. షిమోమి ఫోన్లకు భారత్ లో డిమాండ్ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నుంచి వచ్చిన రెడ్ మీ నోట్4 ఫోన్లు హాట్ కేకుల్లా అమ్మడయ్యాయి. దానికి కొనసాగింపుగానే ఈ ఫోన్లను విడుదల చేశారు. ఈ రెండు ఫోన్లు కూడా బడ్జెట్ ధరలోనే విడుదల చేయడం విశేషం.

ఈ రెండు ఫోన్లు 4జీబీ, 6జీబీ వేరింయట్స్ లో లభ్యం అవుతున్నాయి. ఐఫోన్ ఎక్స్ తరహాలో ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమేరా ,ఎల్ఈడీ ఫ్లాష్ లభిస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ సదుపాయం కూడా ఉంది. రెడ్ మీ నోట్ 5 ప్రోలో అత్యధికంగా 4000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలదు. 5.99 ఇంచెస్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టమ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu