తెలుగు తేజానికి చేదు అనుభవం

Published : Nov 04, 2017, 03:39 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
తెలుగు తేజానికి చేదు అనుభవం

సారాంశం

పీవీ సింధుకి చేదు అనుభవం ఎయిర్ లైన్స్ సిబ్బందిపై మండిపడ్డ సింధు తమ తప్పేమి లేదన్న ఎయిర్ లైన్స్ సిబ్బంది

బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం, రియో ఒలంపిక్ పతక విజేత పీవీ సింధుకి చేదు అనుభవం ఎదురైందట.  ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఒకరు ఆమెతో అనుచితంతగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ‘‘ చెప్పడానికే బాధగా ఉంది. నవంబర్ 4న హైదరాబాద్ నుంచి ముంబయికి 6ఈ608 ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా గ్రౌండ్ స్టాఫ్ అజితేజ్ నుంచి చేదు అనుభం ఎదురైంది’’ అని ఆమె ట్వీట్ చేశారు.

 

ఎయిర్ హోస్టెస్ అషిమా తో మాట్లాడితే.. మీకు పూర్తి విషయం తెలుస్తుంది అంటూ మరో ట్వీట్ కూడా సింధు చేశారు. ఆమె ట్వీట్ చేసిన కొద్ది సమయానికే.. ఆ ట్వీట్ వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారులు దీనిపై స్పందించారు. తమ విమాన సిబ్బంది ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదని చెప్పారు.  సిబ్బంది కేవలం వాళ్ల పని వారు నిర్వర్తించారని స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu