హైదరాబాద్ లో ప్రత్యక్షమయిన ప్రియాంక గాంధీ

Published : Feb 18, 2017, 07:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
హైదరాబాద్ లో ప్రత్యక్షమయిన ప్రియాంక గాంధీ

సారాంశం

కుమారుడి కంటి పరీక్ష కోసం హైదరాబాద్ కు వచ్చిన ప్రియాంక

కాంగ్రెస్ నాయకురాలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు  ప్రియాంక గాంధీ ఈ రోజు హైదరాబాద్ లో ప్రత్యక్ష మయ్యారు.

 

కుమారుడు రేహన్ కంటి పరీక్ష కోసం ఆమె హైదరాబాద్ లోని ఎల్ విప్రసాద్ ఇన్స్ స్టిట్యూట్ కు  ఈ మధ్యాహ్నం చేరుకున్నారు.

 

నిన్నటి దాకా  యుపి ఎన్నికల ప్రచారంలో హడావిడిగా ఉన్న ప్రియాంక ఈ రోజు హైదరాబాద్ లో అకస్మాత్తుగా కనిపించడం అసుపత్రి అవరణలో ఉన్నవారందరిని అశ్యర్యానికి గురి చేసింది.

 

ఆమె వెంట రాజ్యసభ సభ్యుడ  టి సుబ్బరామిరెడ్డి కూతరు పింకి రెడ్డి కూడా ఉన్నారు.

 

ఈ మధ్య క్రికెట్ అడుతున్నపుడు కుమారుడు రేహన్ కంటికి దెబ్బతగిలింది. తర్వాత ఢిల్లీలోని  ఎఐఐఎంఎస్  కు తీసుకువెళ్లి పరీక్ష చేయించారు. వారు వెంటనే హైదరాబాద్ లోని ఎల్ విప్రసాద్ ఇన్ స్టిట్యూట్ కు తీసుకువెళ్లాలని సూచించడంతో  ఆమె హైదరాబాద్ కు వచ్చారని తెలిసింది.

 

 ఈ విషయం మీద ఆసుపత్రివర్గాలు మాట్లాడనిరాకరించాయి.

 

 ప్రియాంక హైదరాబాద్ రాక విషయం కాంగ్రెస్ నాయకులకు తెలియదు. కొంతమంది ప్రముఖుకుల మాత్రం ఈ ఉదయం చెప్పి, ఎవరూ ప్రియాంకను కలువద్దని సలహా  ఇచ్చారు.

‘ ఇది పూర్తిగా ప్రయివేటు పర్యటన. వైద్యపరీక్షల కోసం ఆమెవస్తున్నారు. కాబట్టి నాయకులు,  కార్యకర్తులు వెళ్లి ఇబ్బంది పెట్టవద్దు,’ అని టెన్ జన్ పథ్ నుంచి సూచనలు వచ్చినట్లు సీనియర నాయకుడొకరు ఎసియానెట్ కు తెలిపారు.

 

ఆమె ఈ సాయంకాలమే ఢిల్లీ వెళ్లిపోతున్నారు.

 

హైదరాబాద్ హెల్త్ క్యాపిటల్ అయిందనేందుకు ఇదొక తార్కాణం.  ఎయిమ్స్ కూడా రోగులను హైదరాబాద్ ఆసుపత్రికి సిఫార్స్ చేయడం విశేషం.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !