
ప్రధాని నరేంద్రమోడీ భార్య జశోదాబేన్ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. రాజస్థాన్లోని కోటా-చిత్తోర్ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న కారు బోర్లా పడింది. ఈ ఘటనలో జశోదాబేన్ తోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. ప్రమాదంలో జశోదా తలకు గాయాలు కాగా.. ఆమెను చికిత్స నిమిత్తం చిత్తోరగఢ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జశోదా తన సోదరుడు అశోక్ మోదీతో కలిసి గుజరాత్ మెహసానా జిల్లాలోని ఉన్జా పట్టణంలో నివసిస్తున్నారు. ఆమెకు మెహసానా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.