(వీడియో) ఎర్రన్నాయుడి కొడుకును ఆశీర్వదిస్తున్న ముఖ్యమంత్రి బాబు

First Published Jun 14, 2017, 10:02 PM IST
Highlights

శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు నవ వధూవరులను ఆశీర్వదించిన  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విశాఖలో కింజరాపు కుటుంబ సభ్యులతో పాటు  కాసేపు వివాహ వేడుకలో గడిపిన సీఎం.

శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడి వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.  నూతన వధూవరులను ఆశీర్వదించారు. దివంగత టిడిపి నేత కింజారపు ఎర్రన్నాయుడి కుమారుడయిన రామ్మోహన్ నాయుడి పెళ్లి  విశాఖ లో రేపు తెల్లవారు జామున జరుగుతున్నది. పెళ్లి కూతురెవరో కాదు ఎమ్మెల్యే సత్యనారాయణ కుమార్తె శ్రావ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటంబంతో కలసి కింజరాపు కుటుంబ సభ్యులతో పాటు రిసెప్షన్ వేడుకలో  కొద్దిసేపు  గడిపారు. 

   ఈ వేడుకలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్‌ గజపతిరాజు, సురేష్‌ప్రభుతో పాటు రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, చినరాజప్ప, కళా వెంకట్రావు, కె.ఎస్‌.జవహార్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు, నక్కా అనంద్‌బాబు, కొల్లు రవీంద్ర, సుజయకృష్ణ రంగారావు, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌, శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి, ఎంపీలు గల్లా జయదేవ్‌, రాయపాటి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కేశినేని నాని, మాజీ ఎంపీ నామా నాగేశ్వరావు, విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్సీలు, తదితరులు హాజరయ్యారు.

గురువారం తెల్లవారు జామున మూడు గంటలకు ముహూర్తం.

 

click me!