మిషన్ భగీరథ పనుల్లో అపశృతి

Published : Dec 23, 2017, 07:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
మిషన్ భగీరథ పనుల్లో అపశృతి

సారాంశం

మిషన్ భగీరథ పనుల్లో ప్రమాదం ఆరుగురికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు

నాగర్ కర్నూల్ జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది.  కొల్లాపూర్ మండలం ఎల్లూరు లో  గ్రామంలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ ఓవర హెడ్ వాటర్ ట్యాంక్ పైకప్పు కూలడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

 మొత్తం గాయపడిన ఆరుగురిలో ఒకరు మినహా మిగతా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నారు.   

ఈ సంఘనసపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని తెలుసుకున్నారు.  ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu