నా కుమారుడికి సహాయం చేయండి.. సుహాసిని మణిరత్నం

Published : Aug 28, 2017, 11:42 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
నా కుమారుడికి సహాయం చేయండి.. సుహాసిని మణిరత్నం

సారాంశం

మణిరత్నం,  సుహాసిని దంపతుల కుమారుడు నందన్‌ ఇటలీలో దోపిడీకి గురయ్యారు ఈ విషయాన్ని సుహాసిని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు

 

 నా కుమారుడికి సహాయం చేయండంటూ ప్రముఖ సినీ నటి సుహాసినీ  మణిరత్నం అభిమానులను కోరారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని దంపతుల కుమారుడు నందన్‌ ఇటలీలో దోపిడీకి గురయ్యారు. ఈ విషయాన్ని సుహాసిని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఇటలీలోని వెనిస్‌ విమానాశ్రయం దగ్గర్లో ఎవరైనా తెలిసిన వారుంటే తమ కుమారుడికి సాయం చేయాల్సిందిగా కోరారు.

‘ఎవరైనా వెనిస్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఎవరైనా ఉన్నారా..? ఉంటే మా అబ్బాయికి సాయం చేయండి ప్లీజ్‌. అతను బెలున్నో ప్రాంతంలో ఉండగా దోపిడీకి గురయ్యాడు. వెనిస్‌లో ఉండి సాయం చేయలేని వారెవరూ నేను పోస్ట్‌ చేసిన మా అబ్బాయి ఫోన్‌ నెంబర్‌కు దయచేసి ఫోన్‌ చేయకండి. ఎందుకంటే అతని ఫోన్‌లో బ్యాటరీ తక్కువగా ఉంది. మేము అతనితో కాంటాక్ట్‌ను కోల్పోయే అవకాశం ఉంది’ అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నందన్‌ క్షేమంగానే ఉన్నాడని ఓ హోటల్‌లో దిగాడని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమ కుమారుడికి సాయం చేసిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu