విశాఖ నడిరోడ్డులో మహిళపై అత్యాచారం

Published : Oct 23, 2017, 12:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
విశాఖ నడిరోడ్డులో మహిళపై అత్యాచారం

సారాంశం

నడి రోడ్డులో మహిళపై అత్యాచారం వీడియోలు తీసిన స్థానికులు

మనుషుల్లో మానవత్వం మాయమైపోతోంది. ఇందుకు నిదర్శనమే విశాఖలో జరిగిన తాజా సంఘటన.  నడిరోడ్డుపై ఓ కామంధుడు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్టేషన్ రోడ్డులో మతి స్థిమితంలేని మహిళలపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతుంటే.. స్థానికులు చూస్తూ ఉండిపోయారు. కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమానార్హం. మహిళను రక్షించాల్సింది పోయి.. కొందరు తమ మొబైల్ ఫోన్ లలో వీడియోలు తీశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టిస్తోంది. బాధితురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. బాధిత మహిళకు గత కొంతకాలంగా మానసిక పరిస్థితి సరికాలేదని తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu