NEWS
ఇంత తొందరగా తెలంగాణా ప్రభుత్వం పాడువుతుందని తాను వూహించలేదని తెలంగాణా జెఎసి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ్ రామ్ ఆశ్చర్యపోయారు. రెండో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రను నేడు సికింద్రాబాద్ క్లాక్టవర్ నుంచి ఆయన మొదలుపెట్టారు.
ఇంత తొందరగా తెలంగాణా ప్రభుత్వం పాడువుతుందని తాను వూహించలేదని తెలంగాణా జెఎసి అధ్యక్షుడు ప్రొఫెషర్ కోదండ్ రామ్ ఆశ్చర్యపోయారు. రెండో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రను సికింద్రాబాద్ క్లాక్టవర్ నుంచి ఆయన మొదలుపెట్టారు. ఇక్కడ నుంచి ఆయన బస్సు సిరిసిల్ల బయలుదేరింది. యాత్ర ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు.‘ ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు,’ అని అన్నారు.ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరగాలని ఆయన అన్నారు.రేపు, ఎల్లుండి కూడా స్ఫూర్తియాత్ర కొనసాగుతుందని ఆయన చెప్పారు.