పాండిచ్చేరిలో మారువేషంలో తిరుగుతున్న కిరణ్ బేడీ

First Published Aug 19, 2017, 4:27 PM IST
Highlights
  • మహిళలకు రక్షణ ఉందో లేదో తెలుసుకునేందుకు ఆమె మారు వేషంలో పర్యటించారట
  • ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు

 

పూర్వకాలంలో మహారాజులు.. తమ రాజ్య ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో.. వారి కష్టాలేమిటో తెలుసుకోవడానికి మారువేషాల్లో పర్యటించేవారు. పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కూడా ఇప్పుడు ఆ మార్గాన్నే అనుసరిస్తున్నారు.  వివరాల్లోకి వెళితే..

పాండిచ్చేరిలో రాత్రి సమయంలో మహిళలకు రక్షణ ఉందో లేదో తెలుసుకునేందుకు ఆమె మారు వేషంలో పర్యటించారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ద్విచక్రవాహనంపై పబ్లిక్ ప్రాంతాల్లో పర్యటించానని ఆమె తెలిపారు.

పోలీసు అధికారులు రాత్రి వేళలో విధులను నిర్వర్తిస్తున్నారో లేదో అనే విషయాన్ని పరిశీలించినట్లు చెప్పారు.

అయితే.. ఒకప్పటి తో పోలిస్తే పాండిచ్చేరిలో నేరాల శాతం తగ్గిందని.. ఇప్పుడు బాగానే ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

click me!