కర్ణాటక పోల్స్: రాజరాజేశ్వరి నగర్ పోలింగ్ వాయిదా

Published : May 11, 2018, 07:23 PM IST
కర్ణాటక పోల్స్: రాజరాజేశ్వరి నగర్ పోలింగ్ వాయిదా

సారాంశం

కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ వాయిదా పడింది.

అమరావతి: కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ వాయిదా పడింది. రేపు శనివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ నిర్ణయం వెలువడింది. ఈ స్థానానికి మే 28వ తేదీన లేదా 31వ తేదీన పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. 

రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్) నియోజకవర్గంలోని ఓ అపార్టుమెంటులో దాదాపు వేయి నకిలీ ఓటరు కార్డులు లభించిన విషయం తెలిసిందే. మంజుల అనే ఓ మహిళ పేరుతో రిజిస్టర్ అయి ఉన్న అపార్టుమెంటులో అవి బయపడ్డాయి. 

ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేశారు. దాంతో రాజరాజేశ్వరినగర్ పోలింగును ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఆ అపార్టుమెంట్ కాంగ్రెసు ప్రజాప్రతినిధిది అని బిజెపి విమర్శిస్తోంది. 

ఆ అపార్టుమెంటు స్థానిక బిజెపి నేతదని, తప్పుడు సాక్ష్యం సృష్టించి బిజెపి నాటకం ఆడుతోందని కాంగ్రెసు ఎదురు దాడికి దిగింది. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !