కర్ణాటకలో ముగిసిన పోలింగ్: ఈవిఎంల్లో నేతల భవిష్యత్తు

Published : May 12, 2018, 06:39 PM IST
కర్ణాటకలో ముగిసిన పోలింగ్: ఈవిఎంల్లో నేతల భవిష్యత్తు

సారాంశం

కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం ముగిసింది. 

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు సాగింది. రాష్ట్రంలోని 224 స్థానాల్లో 222 స్థానాలకు పోలింగ్ జరిగింది. 

బిజెపి అభ్యర్థి మృతి వల్ల జయనగర్ ఎన్నిక వాయిదా పడగా, నకిలీ ఓటరు ఐడి కార్డుల మూలంగా రాజరాజేశ్వరినగర్ పోలింగ్ ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది. చెదురు మొదరు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 

నేతల భవిష్యత్తు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఈ నెల 15వ తేదీన ఓట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నెల 17వ తేదీన తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప చెప్పగా, ఆయనకు మతిభ్రమించిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. 


సాయంత్రం 5 గంటల వరకు 61.25 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, హెబ్బాల్ నియోజకవర్గంలోని నెంబర్ 2 పోలింగ్ స్టేషథన్ లో రీపోలింగ్ జరుగుతుంది. ఈవిఎంలు పనిచేయకపోవడం రీపోలింగ్ అవసరమైంది.

బెంగళూరులోని హంపీనగర్ లో గల ఓ పోలింగ్ కేంద్రంలో బిజెపి, కాంగ్రెసు కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గుర్తించడానికి బుర్ఖాను తీసేయడానికి నిరాకరించడంతో ో మహిళను బెలగావిలోని పోలింగ్ బూత్ లోకి అనుతించలేదు.

శిమోగాలో 150వ నెంబర్ బూత్ లో ఓటు వేయడానికి వీల్ చైర్లో  వచ్చింది. సిర్సీలో ఓటు వేయడానికి కేంద్ర మంత్రి అనంతకుమార్ క్యూలో నించున్నారు. పెళ్లికి ముందు ఓ యువతి మడకెరిలో ఓటు వేసింది.

పోలింగ్ సిబ్బంది కాంగ్రెసు అభ్యర్థి వినయ్ కులకర్ణికి ఓటు వేయాలని చెబుతున్నారని ఆరోపిస్తూ కరడిగుడ్డలోని 58వ నెంబర్ కేంద్రం వద్ద బిజెపి కార్యకర్తలు ధర్నాకు దిగారు. 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu