NEWS
శ్రీలంక వేదికగా జరుగుతున్న 6వ న్యాయవ్యాదుల క్రికెట్ ప్రపంచకప్ లో భారత జట్లు ఇప్పటికే భారీ విజయాలను సాధించాయి. భాారత్-A భారత్ -B జట్లు ఇప్పటికే చెరో రెండు విజయాలను నమోదు చేసుకున్నాయి. సోమవారం నాడు ఇరు జట్లు తమ మూడవ మ్యాచ్ లల్లో కూడా విజయాను నమోదు చేసుకున్నాయి.
భారత్ -B జట్టు ఇంగ్లాండు సోలీటర్స్ తో తలపడింది, మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ న్యాయవాదులు 35 ఓవర్లకు 293 పరుగులు చేసింది. పూర్తిగా బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు పరుగుల వరద పారించారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఇండియన్ లాయర్లు కేవలం 27 ఓవర్లకే ప్రత్యర్ధి ఇచ్చిన టార్గెట్ ను చేధించారు. భారత బ్యాట్స్మేన్ అయినా అజయ్ సెంచరీకి చేరువై అవుట్ అయ్యాడు. అజయ్ 91 పరుగు చేశారు.
భాారత్-A జట్టు కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. బారీస్టర్ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. 35 ఓవర్లకు ఇండియన్ లాయర్లు 403 పరుగులు చశారు. అందులో సోమనాథ్ సర్కార్ 58 బంతుల్లో 104 పరుగులు చేశారు. బారీస్టర్ ఇంగ్లాండ్ చేజింగ్ చతికిళ్లబడింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు భారత బౌలర్ల దాటికి చేతులేత్తేశారు. 89 పరుగులకే అలౌట్ అయింది. దీనితో భాారత్-A జట్టు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.