సింగపూర్ లో అమరావతి రైతులు

Published : Oct 31, 2017, 02:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
సింగపూర్ లో అమరావతి రైతులు

సారాంశం

అమరావతి రైతులకు సింగపూర్ లో ఘన స్వాగతం 34మంది రైతుల తొలి బృందం సీఆర్డీఏ అధికారులతో కలిసి సింగపూర్ బయలుదేరి వెళ్లారు.

అమరావతి రైతులకు సింగపూర్ లో ఘన స్వాగతం లభించింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల్లో 123 మంది రైతులను ప్రభుత్వం సింగపూర్ కి తీసుకువెళ్లడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 34మంది రైతుల తొలి బృందం సీఆర్డీఏ అధికారులతో కలిసి సింగపూర్ బయలుదేరి వెళ్లారు.

ఈ రైతులకు సింగపూర్ విమానాశ్రయంలో సింగపూర్ తెదేపా ఫోరం ప్రతినిధులు జైరాం, చెన్నపాటి భానుచంద్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.  నాలుగురోజులపాటు సింగపూర్‌లో వివిధ ప్రాంతాల్లో రైతులు పర్యటిస్తారు. 40 ఏళ్లలో సింగపూర్‌ అభివృద్ధి ఎలా సాధించిందో రైతులు పరిశీలిస్తారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్‌ చెన్నకేశవరావు తదితరులు రైతులతో ఉన్నారు.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu