సోనియా ఇలాకాలో అమిత్ షా, యోగీలకు తప్పిన ప్రమాదం

First Published Apr 22, 2018, 12:13 PM IST
Highlights

ఉత్తర ప్రదేశ్ పర్యటనలో వున్న బిజెపి చీఫ్ అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పెను ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ మాజీ అద్యక్షురాలు సోనియాగాంధి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ పార్లమెంట్ పరిధిలో తమ పట్టును పెంచుకునేందకు బిజెపి అద్యక్షులు అమిత్ షా, సీఎం యోగితో కలిసి పర్యటించారు. అనంతరం ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే వీరు వేదికపై ఉండగానే వేదిక సమీనపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. 

రాయ్‌బరేలీలో ఏర్పాటుచేసిన ఓ బహిరంగ సభ వేదికపై షా, యోగి ఉండగా మీడియా ఎన్‌క్లోజర్‌ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు, బద్రతా సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే ఈ ప్రమాదంలో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నప్పటికి ఆ తర్వాత సభ సజావుగానే సాగింది.
 

ఉత్తర ప్రదేశ్ పర్యటనలో వున్న బిజెపి చీఫ్ అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పెను ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ మాజీ అద్యక్షురాలు సోనియాగాంధి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ పార్లమెంట్ పరిధిలో తమ పట్టును పెంచుకునేందకు బిజెపి అద్యక్షులు అమిత్ షా, సీఎం యోగితో కలిసి పర్యటించారు. అనంతరం ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే వీరు వేదికపై ఉండగానే వేదిక సమీనపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. 

రాయ్‌బరేలీలో ఏర్పాటుచేసిన ఓ బహిరంగ సభ వేదికపై షా, యోగి ఉండగా మీడియా ఎన్‌క్లోజర్‌ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు, బద్రతా సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే ఈ ప్రమాదంలో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నప్పటికి ఆ తర్వాత సభ సజావుగానే సాగింది.
 

click me!