విమాన ప్రమాదంలో షారూఖ్ అంటూ యూరోప్ చానెల్ వార్త

First Published Jun 1, 2017, 3:02 PM IST
Highlights

బాలీవుడ్‌ హీరో  షారుక్‌ ఖాన్‌ ఒక విమాన ప్రమాదంలో చనిపోయాడంటూ యూరప్‌కి చెందిన యూరోపియర్ న్యూస్ నెట్ వర్క్, ఎల్ పారిస్ టివి ఒక షాకింగ్ న్యూస్ ప్రసారం చేశాయి. షారుక్‌ ఫొటో చూపిస్తూ ‘షారుక్‌ బిజినెస్‌ పని మీద పారిస్‌ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఆయన ప్రయాణిస్తున్న గల్ఫ్‌స్ట్రీం జీ 550 జెట్‌ వాతావరణ కల్లోలం కారణంగాకుప్ప కూలిపోయింది. ఆ ప్రమాదంలో షారుక్‌తో పాటు అనుచరులు కూడా చనిపోయారు.’ అని ఛానెల్స్  ప్రసారం చేశాయి.

బాలీవుడ్‌ హీరో  షారుఖ్ ఖాన్‌ ఒక విమాన ప్రమాదంలో చనిపోయాడంటూ యూరప్‌కి చెందిన యూరోపియర్ న్యూస్ నెట్ వర్క్, ఎల్ పారిస్ టివి ఒక షాకింగ్ న్యూస్ ప్రసారం చేశాయి.

షారుక్‌ ఫొటో చూపిస్తూ ... ‘షారుఖ్  బిజినెస్‌ పని మీద పారిస్‌ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఆయన ప్రయాణిస్తున్న గల్ఫ్‌స్ట్రీం జీ 550 జెట్‌ వాతావరణ కల్లోలం కారణంగాకుప్ప కూలిపోయింది. ఆ ప్రమాదంలో షారుఖ్తో పాటు మరో ఏడుగురు చనిపోయారు.’ అని ఛానెల్స్  ప్రసారం చేశాయి.

ఈవార్తల ప్రకారం షారూఖ్ తన పర్సనల్ అసిస్టెంట్, మరొక ఇద్దరి తోకలసి పారిస్ వెళుతున్నారు. ఈ న్యూస్ ప్రపంచవ్యాపితంగా ఉన్న భారతీయులను షాక్ కు గురి చేసింది.

ఒరిజినల్ న్యూసేమో గాని, భారతీయ మీడియా న్యూస్ వైరల్‌ అయింది. పాకిస్తాన్ పత్రికల్ ఇండియన్ మీడియా కథనాలనుఉటంకిస్తూ ఈ వార్తను ప్రచురిస్తున్నాయి.

మారడంతో యావత్‌ భారతదేశం ఉలిక్కిపడింది. దాంతో షారుఖ్కి తెలిసిన వారందరికీ ఉదయం నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయట.

ఈ వార్త లో భారత దేశంలో సంచలనం సృష్టించిందని, అయితే, అలాంటి దుర్ఘటనేమీ జరగలేదని జియో న్యూస్ పేర్కొంది.

 

షారుఖ్ ప్రస్తుతం ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘డ్వార్ఫ్‌’ సినిమా చిత్రీకరణ కోసం మీరట్‌లో ఉన్నారట. దీనిమీద షారూఖ్ స్పందనేమీ లేదు. ఆయన ట్విట్టర్ లో ఎలాంటిపోస్టులేదు.

 

click me!