వెంకయ్య స్వర్ణ భారతి ట్రస్టు అక్రమాల ఆధారాలివిగో... సిపిఐ

Published : Apr 07, 2017, 07:16 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
వెంకయ్య స్వర్ణ భారతి ట్రస్టు అక్రమాల  ఆధారాలివిగో... సిపిఐ

సారాంశం

వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యులు నిర్వహించే ఈ ట్రస్టు అక్రమంగా, బలవంతంగా భూములను  లాక్కుంటూన్నదని సిపిఐ ఆధారాలు చూపింది

ప్రయివేటు భూములను, ప్రభుత్వ భూములను , శిఖం, పోరంబోకు భూములను, కోట్ల విలువయిన భూములను తీసుకుని స్వర్ణ భారతి ట్రస్టు నిర్మాణాలు చేపడుతున్నారని సిపిఐ ప్రధాని నరేంద్ర మోదీకి ఈ రోజు  లేఖ రాసింది. సిపిఐకార్యదర్శి రామకృష్ణ ఈ రోజు స్వర్ణభారతి ట్రస్టు అక్రమాలను ఆధారాలతో బయటపెట్టారు. ట్రస్టు   బాధితులను ఈ రోజు ఆయన విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టారు. ట్రస్టు ఒక క్విడ్ ప్రో క్వో వ్యవహారమని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తమ విమర్శలకు సమాధానం చెప్పాలని  రామకృష్ణ  ఆరోపించారు. ఈ వ్యవహారాల మీద విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో  సత్యనారాయణ అనే కాంట్రాక్టర్ ట్రస్టు తనని ఎలా మోసం చేసిందో వివరించారు.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !