ఎన్డీటివి ప్రణయ్ రాయ్ ఇళ్ల మీద సిబిఐ దాడులు

First Published Jun 5, 2017, 4:56 PM IST
Highlights

ఎన్డీటీవీ సంస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ కో-ఛైర్మన్‌ ప్రణయ్‌రాయ్‌ నివాసంలో సీబీఐ నేడు సోదాలు చేపట్టింది. ఢిల్లీ, డెహ్రడూన్ లలోని ప్రణయ్‌ నివాసాల్లో ఉదయం నుంచి సిబి ఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక బ్యాంకుకు డబ్బులు చెల్లించకుండా నష్టం కలిగించారనే ఆరోపణలతో సీబీఐ ఈ సోదాలు చేపట్టింది. 

ఎన్డీటీవీ సంస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ కో-ఛైర్మన్‌ ప్రణయ్‌రాయ్‌ నివాసంలో సీబీఐ నేడు సోదాలు చేపట్టింది. ఢిల్లీ, డెహ్రడూన్ లలోని ప్రణయ్‌ నివాసాల్లో ఉదయం నుంచి సిబి ఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక బ్యాంకుకు డబ్బులు చెల్లించకుండా నష్టం కలిగించారనే ఆరోపణలతో సీబీఐ ఈ సోదాలు చేపట్టింది. ప్రణయ్‌రాయ్‌, భార్య రాధికా రాయ్‌, మరో ప్రయివేటు కంపెనీ ఆర్ ఆర్ పి ఆర్ హోల్డింగ్స్ లు కలసి ఐసిఐ సిఐ కు దాదాపు రు. 48 కోట్లు నష్టం కల్గించారని సీబీఐ కేసు నమోదు చేసింది. డెహ్రాడూన్, ఢల్లీలలో మొత్తం నాలుగు చోట్ల ఈ దాడులు జరిగాయి.

click me!