గుప్త నిధుల కోసం.. తాంత్రిక పూజలు

Published : Jan 11, 2018, 03:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
గుప్త నిధుల కోసం.. తాంత్రిక పూజలు

సారాంశం

మరోసారి ఏపీలో తాంత్రిక పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తాంత్రిక పూజలు కలకలం రేపాయి. గత కొద్ది రోజుల క్రితం విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజలు ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. ఈ పూజల కారణంగా ఏకంగా ఈవోనే బదిలీ అయ్యారు. ఈ వివాదం ఇంకా సమసిపోకముందే.. మరోసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తాజాగా కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో తాంత్రిక పూజలు జరిపారు.  అధికారులే స్వయంగా ఈ పూజలు జరిపించినట్లు సమాచారం. బుధవారం రోజున ఉదయం నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా  ఈ పూజలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు.

గుప్తనిధుల కోసమే..  అధికారులు ఈ పూజలు చేశారని సమాచారం. కొద్ది రోజుల క్రితం ఇదే చెన్నంపల్లి కోటలో గుప్తనిధులు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఆ నిధుల కోసం రోజులపాటు తవ్వకాలు జరిపారు. అయినప్పటికీ.. ఎలాంటి నిధులు బయటపడలేదు. కేవలం  గుర్రం ఎముకలు, ఇటుకలు మాత్రమే లభ్యమయ్యాయి. దీంతో.. తాంత్రిక పూజలు జరిపితే.. నిధి బయటపడే అవకాశం ఉందని ఇలా చేశారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం కానీ, ఉన్నతాధికారులు కానీ ఎవరూ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu