విద్యార్థుల ఆత్మహత్యల మీద ఆంధ్రలో ఎమర్జన్సీ సమావేశం

Published : Oct 13, 2017, 01:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
విద్యార్థుల ఆత్మహత్యల మీద ఆంధ్రలో ఎమర్జన్సీ సమావేశం

సారాంశం

విద్యార్థుల ఆత్మహత్యల నివారణ చర్య ల గురించి చర్చ

తెలుగు రాష్ట్రాలలో నారాయణ, చైతన్యకళాశాలలో విద్యార్థుల  ఆత్మహత్యలు తీవ్రమవుతూ ఉండటంలో ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. రాష్ట్రమావనవనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ సమావేశానికిఅధ్యక్షత వహిస్తారు. సమావేవం  అక్టోబర్ 16 న జరుగుతున్నది.  ఈ రోజు విజ‌య‌వాడ‌లోని శ్రీ చైతన్య క‌ళాశాల‌లో ఇంట‌ర్ విద్యార్థి  భార్గవ రెడ్డి ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌పై  తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. కడప జిల్లా రాయచోటికి చెందిన భార్గవరెడ్డి ఈ ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులలో అత్యధికులు ఈ రెండు కాలేజీలకు చెందిన వారే. భార్గవరెడ్డి ఆత్మహత్య మీద స్పందిస్తూ క‌ళాశాల యాజ‌మాన్యంపై క‌ఠిన చ‌ర్య‌లు వుంటాయ‌ని  మంత్రి గంటా స్పష్టం చేశారు. ఘ‌ట‌న‌పై ప్రాథ‌మిక వివ‌రాలు తెలుసుకొన్న మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఈ సంఘటన మీద విచారణ జరపాలని ఇంట‌ర్మీడియ‌ట్ క‌మీష‌న‌ర్ ను విచార‌ణ‌కు ఆదేశించారు. 

విద్యార్థుల ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌ల నివార‌ణ‌కు 16న జరుపుతున్న స‌మావేశానికి హాజరుకావాలని  కార్పొరేట్ కళాశాలన్నింటికి ఆదేశాలు జారీచేశారు.

చ‌క్ర‌పాణి క‌మిటీ ద్విస‌భ్య స‌భ్యులు కూడా ఈ స‌మావేశానికి హాజ‌రవుతారు. కార్పోరేట్ క‌ళాశాలల్లో ఆత్మ‌హ‌త్య  ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతుండ‌టం దుర‌దృష్ట‌క‌రమని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశానికి హాజరుకాని కళాశాలమీద  చర్యలుంటాయని, గుర్తింపు ర‌ద్దు చేసేందుకు వెనకాడమని  మంత్రి గంటా హెచ్చరించారు.

 

 

మరిన్ని తాజా వార్తల కోసం క్రింద క్లిక్ చేయండి

https://goo.gl/cJzb9d

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !