ఓ దొండగుడు ఇంట్లో దొంగతనానికి వచ్చి.. ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఓ దొండగుడు ఇంట్లో దొంగతనానికి వచ్చి.. ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... కురుబరహల్లికి చెందిన దేవరాజ్ (21) బెంగళూరులోని ఓ ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. కాగా అక్కడ పనిచేస్తే వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో.. రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
ఈ నేపథ్యంలో.. ఇటీవల ఓ మహిళ ఇంట్లో దొంగతానికి వెళ్లాడు. ఇంట్లో మహిళ(33) ఒంటరిగా నివసిస్తోంది. దీన్ని గమనించిన దేవరాజ్ ఒంటరి మహిళ ఇంట్లోకి వచ్చి ఆమెపై అత్యాచారం చేసి, ఇంట్లో వస్తువులను ఎత్తుకెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడైన దేవరాజ్ ను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.
దేవరాజ్ పై ఆరు కేసులు నమోదైనాయని పోలీసులు చెప్పారు. కాగా.. దొంగతనం, అత్యాచారం రెండు కేసుల కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితుడిని విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.