
UP CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో బీజేపీ వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు( ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలువనున్నారు. ఈ తరుణంలో నూతన మంత్రివర్గ ఏర్పాటు పై చర్చించనున్నరని సమాచారం. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, ఢిల్లీలో బీఎల్ సంతోష్ హాజరుకానున్నారు. అలాగే ఈ భేటీలో ప్రమాణ స్వీకార తేదీపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తున్నది. న్యూ డిప్యూటీ సీఎం విషయాన్ని కూడా ఫైనల్ చేయనున్నారట. ఈ సమావేశంలో ఆదిత్యనాథ్తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రతన్ దేవ్ సింగ్, మంత్రి సునీల్ బన్సాల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ రాధామోహన్ సింగ్ కూడా ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు.
భాజపా తన మంత్రివర్గంలో ప్రతి కులానికి స్థానం కల్పించే క్రమంలో విద్యార్హతలు, కులం, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని.. డిప్యూటీ సీఎంలు, మంత్రుల జాబితాను తయారు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటు దక్కుతుందని, ఇప్పటికే ప్రాథమిక జాబితాను సిద్దం చేసినట్టు సమాచారం. దీనిపై బీజేపీ కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది.
ఉప ముఖ్యమంత్రి రేసులో స్వతంత్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, బ్రిజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో స్వతంత్ర దేవ్ సింగ్ రవాణా మంత్రిగా ఉన్నారు, ఇది కాకుండా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కూడా. ఇక కేశవ్ ప్రసాద్ మౌర్య ఈసారి ఎన్నికలలో సిరతు స్థానం నుండి ఖచ్చితంగా ఓడిపోయారు, కానీ అతను OBC వర్గానికి చెందిన వాడు. ఉపముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించారు కాబట్టి మరోసారి ఉపముఖ్యమంత్రిగా అవకాశం ఉండవచ్చునని సమాచారం.
బేబీ రాణి మౌర్య ఉత్తరాఖండ్ గవర్నర్గా ఉన్నారు, ఉత్తరప్రదేశ్లోని జాతవ్ సమాజానికి చెందిన నాయకురాలు. ఇక, బ్రిజేష్ పాఠక్ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి. యోగి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. యుపి బిజెపి చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ కుర్మీ నాయకుడు కూడా, ఉత్తరప్రదేశ్లో బిజెపి భారీ విజయంలో ఆయన కీలక ప్రాత పోహించారు. ఇక ఇద్దరు మాజీ పోలీసు అధికారులు రాజేశ్వర్ సింగ్, అసిమ్ అరుణ్లను యోగి తన క్యాబినెట్లో చేర్చే అంశాన్ని బీజేపీ నాయకత్వం పరిశీలిస్తుందని సమాచారం.
లక్నోలోని సరోజినీ నగర్ స్థానం నుండి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర్ సింగ్ ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారి. కన్నౌజ్ (సదర్) స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అసీమ్ అరుణ్ విజయం సాధించారు. అసిమ్ అరుణ్ ఏడీజీ స్థాయి అధికారి. కాన్పూర్ మొదటి పోలీస్ కమిషనర్ కాకముందు, అసిమ్ అరుణ్ తండ్రి దివంగత రామ్ అరుణ్ ఉత్తరప్రదేశ్ డీజీపీగా పనిచేశారు.
అలాగే.. చాలా మంది భారతీయ జనతా పార్టీ నేతలు భారీ ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇందులో నోయిడా అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్. ఆయన 1,81,513 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయనకు కూడా యోగి కేబినెట్లో చోటు దక్కుతుందని బీజేపీ సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు నోయిడా నుంచి యోగి కేబినెట్లో ఎవరికీ చోటు దక్కలేదు కాబట్టి పంకజ్ సింగ్కు ఈసారి యోగి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కవచ్చని భావిస్తున్నారు.
అలాగే.. యోగికి సన్నిహితుడైన బ్రాహ్మణ సామాజిక వర్గ నేత, జర్నలిస్ట్ అయిన శలభ్ మణి త్రిపాఠి. ఆయనకు కూడా యోగి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశముందని టాక్. శలభ్ గతంలో ఏబీవీపీలో పని చేశారు. అలాగే.. మిత్రపక్షాలైన అప్నా దళ్, నిషాద్ పార్టీకి కూడా కేబినెట్లో స్థానం లభిస్తుందనీ, ఎమ్మెల్సీ ఆశిష్ పటేల్, సంజయ్ నిషాద్ లు బీజేపీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించారు. అన్ని కేటాయింపులు పూర్తి అయినా తరువాత మార్చి 15 లేదా 21న యోగి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ఇదిలాఉంటే.. ఆదిత్యనాథ్ శుక్రవారం లక్నోలోని రాజ్భవన్లో గవర్నర్ ఆనందీబెన్ పటేల్కు తన రాజీనామాను సమర్పించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం ఆదిత్యనాథ్ శుక్రవారం లక్నోలోని పార్టీ కార్యాలయంలో తన మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. యోగి ఆదిత్యనాథ్ తన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గం నుండి 1,03,390 తేడాతో గెలుపొందారు. ఇటీవల జరిగిన UP అసెంబ్లీ ఎన్నికల్లో 62,109 ఓట్లతో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి సుభావతి ఉపేంద్ర దత్ శుక్లాపై విజయం సాధించారు. యూపీలో పూర్తి పదవీకాలం సీఎంగా ఉండి.. మరోసారి విజయం సాధించారు. దీంతో గత 37 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ నిల్చారు.