ప్రేమను నిరాకరించిందోనో లేదంటే పెళ్లికి ఒప్పుకోలేదని అమ్మాయిలపై యాసిడ్ దాడి వార్తలు చాలా చూశాం. అయితే అమ్మాయే అబ్బాయిపై యాసిడ్ దాడి చేసింది.
ప్రేమను నిరాకరించిందోనో లేదంటే పెళ్లికి ఒప్పుకోలేదని అమ్మాయిలపై యాసిడ్ దాడి వార్తలు చాలా చూశాం. అయితే అమ్మాయే అబ్బాయిపై యాసిడ్ దాడి చేసింది. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధానిలో వారం రోజుల క్రితం బైక్ మీద వెళ్తున్న జంటపై జరిగిన యాసిడ్ దాడి కేసును పోలీసులు ఛేదించారు.
వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన యువతి, యువకులు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోమంటూ సదరు యువతి ఒత్తిడి చేయడం ప్రారంభించింది.
అందుకు యువకుడు ససేమిరా అన్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. ప్రేమికుడి అంతు చూడాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా ఈ నెల 11న ప్రేమికులిద్దరూ బైక్పై బయటకు వెళ్లారు.
అప్పుడు ప్లాన్లో భాగంగా యువతి.. నీ ముఖం సరిగా కనిపించడం లేదు.. హెల్మెట్ తీసేయమని కోరింది. ప్రియురాలు కోరికను మన్నించిన అతని ముఖంపై వెంటనే యాసిడ్ను చల్లింది.
దీంతో అతని మెడ, గొంతు, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. కాగా ఈ దాడిలో ఆ యువతికి కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
బైక్పై తామిద్దరం వెళ్తుండగా.. తన ప్రియురాలు హెల్మెట్ తీయమని కోరిందని.. తర్వాతే తనపై యాసిడ్ దాడి జరిగిందని అతను చెప్పాడు. యువతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోనే ఈ దాడికి పాల్పడినట్లు యువతి నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.