కాలి పట్టీలు అమ్మేశాడని...భర్తపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన భార్య

By telugu teamFirst Published Dec 12, 2019, 12:13 PM IST
Highlights

సెంథిల్‌ మద్యం తాగడానికి డబ్బులు లేకపోవడంతో భార్య కాలి పట్టీలను రూ.1500లకు అమ్మేసి ఆ నగదుతో మద్యం తాగి ఇంటికి వచ్చాడు.పని ముగించుకుని ఇంటికి వచ్చిన చిత్ర తన కలి పట్టీలు కనపడకపోవడంతో భర్తను నిలదీసింది. అతను తాకట్టు పెట్టి మద్యం తాగినట్టు తెలియడంతో ఆగ్రహం చెంది అతనితో వాగ్వాదానికి దిగింది. 

తన కాలి పట్టీలు అమ్మేసి భర్త మద్యం తాగడానే కోపంతో ఓ మహిళ కట్టుకున్న భర్త ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. కాగా అతను ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  

విల్లుపురం జిల్లా కండమంగళం మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన సెంథిల్(36) తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య చిత్ర(32). వీరికి వెట్రివేల్(12), హరీష్(10) అనే ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. కాగా... సెంథిల్ కి మద్యం తాగే అలవాటు ఉంది. కాగా... పనికి వెళ్లకుండా... తరచూ మద్యం తాగుతూ ఉండేవాడు. భార్య కూలి పనులు చేస్తూ సంపాదించిన డబ్బుని తీసుకొని వాటితో జల్సా చేసేవాడు.

మంగళారం చిత్ర కూలికి వెళ్లడంతో ఇంటిలో ఒంటరిగా వున్న సెంథిల్‌ మద్యం తాగడానికి డబ్బులు లేకపోవడంతో భార్య కాలి పట్టీలను రూ.1500లకు అమ్మేసి ఆ నగదుతో మద్యం తాగి ఇంటికి వచ్చాడు.పని ముగించుకుని ఇంటికి వచ్చిన చిత్ర తన కలి పట్టీలు కనపడకపోవడంతో భర్తను నిలదీసింది. అతను తాకట్టు పెట్టి మద్యం తాగినట్టు తెలియడంతో ఆగ్రహం చెంది అతనితో వాగ్వాదానికి దిగింది. 

 తరువాత అందరూ నిద్రపోయారు. ఆగ్రహం చల్లారని చిత్ర ఇంటి ముందు నిలబెట్టి వున్న సెంథిల్‌ బైకు నుంచి పెట్రోలు ఓ బాటిల్‌లో పట్టుకుని నిద్రపోతున్న సెంథిల్‌పై పోసి నిప్పు అంటించింది. మంటలు అంటుకోవడంతో సెంథిల్‌ కేకలు పెట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సెంథిల్‌ను పుదుచ్చేరి కారిమేడు జిప్మర్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

click me!