భర్తలపై మహిళలు వేసే ఫేక్ కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న హైకోర్టు

Published : Jul 13, 2022, 03:00 AM ISTUpdated : Jul 13, 2022, 03:02 AM IST
భర్తలపై మహిళలు వేసే ఫేక్ కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న హైకోర్టు

సారాంశం

ఢిల్లీ హైకోర్టు కీలక విషయాలు తెలిపింది. మహిళలు, తమ భర్తపై, భర్త కుటుంబంపై వేసే అవాస్తవ కేసుల విషయంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని జడ్జీ తెలిపారు. ఇలా నకిలీ కేసులు దాఖలైతే సమాజంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని వివరించారు.  

న్యూఢిల్లీ: భర్త, ఆయన కుటుంబ సభ్యులు అందరిపై మహిళలు వేసే ఫేక్ కేసుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఆ కేసులను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, తద్వార సమాజంలో సంబంధాలను కాపాడాలని వివరించింది. లేదంటే ఈ తీరు చట్టాన్ని దుర్వినియోగ పరిచే అవకాశంగా మారుతుందని హెచ్చరించింది. 

ఓ నకిలీ కేసు విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వరకట్న వేధింపుల కేసు కింద ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమె భర్త, భర్త కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు. సదరు మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు కారణంగా భర్తను నిర్బంధంలోకి తీసుకున్నారు. 

అయితే, వాస్తవానికి ఆ మహిళ ఆత్మహత్య చేసుకోలేదు. ఆమె సజీవంగా ఉన్నది. కానీ, ఆత్మహత్య చేసుకున్నట్టు కుట్ర పన్ని ఓ కేసు పెట్టించింది. తన భర్త, భర్త కుటుంబ సభ్యులపై ఆమె కేసు పెట్టించింది. వరకట్న నిషేధ చట్టం కింద పలు నేర ఆరోపణలతో భర్త, ఆయన కుటుంబంపై కేసు నమోదైంది. కాగా, ఆ వ్యక్తి తల్లి కూడా ఆ మహిళ కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు అబద్ధాలు చెప్పి తన కుటుంబంలో కలిసి ఓ పథకం ప్రకారం మెట్టినింటి నుంచి అదృశ్యమైందని ఆ కేసులో వ్యక్తి తల్లి ఆరోపణలు చేసింది. 

అయితే, ఈ కేసు వివరాలను పైపైన పరిశీలించిన ఎన్నో డొల్ల విషయాలు కనిపిస్తాయని హైకోర్టు తెలిపింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నదన్న విషయం అవాస్తవం అని తేలిందని వివరించింది. కేవలం స్పష్టత లేని ఓ లక్ష్యం కోసం వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారని తెలిపింది. అబద్ధపు ఆత్మహత్య, ఇతర పరిణామాలకు సంబంధించిన వివరాలపై మీడియాలోనూ కవర్ కావడంతో ఆ కుటుంబం అవమానానికి గురవ్వడమే కాకుండా ఆమె భర్త అకారణంగా నిర్బంధానికి గురయ్యాడని హైకోర్టు తెలిపింది.

అంతేకాదు, ఈ కేసు నేపథ్యంలో ఇలాంటి నకిలీ కేసుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జడ్జీ సూచించారు. ఆమెకు అరెస్టు నుంచి రక్షణ కావాలన్న వాదనను తోసిపుచ్చుతూ ఇప్పటికే వారికి యాంటిసిపేటరీ బెయిల్‌ రద్దు చేసినట్టు గుర్తు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM