నలుగురిని లవ్ చేసి.. లక్కీ డ్రాలో ఒకరిని సెలక్ట్ చేసుకొని..

Published : Mar 06, 2021, 09:15 AM ISTUpdated : Mar 06, 2021, 09:18 AM IST
నలుగురిని లవ్ చేసి.. లక్కీ డ్రాలో ఒకరిని సెలక్ట్ చేసుకొని..

సారాంశం

నలుగురి పేర్లు చీటీ రాసి డ్రా తీయగా.. ఎవరి పేరు వస్తే వారితో యువతి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓ యువతి ఒకేసారి నలుగురిని ప్రేమించింది. ఆ నలుగురితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కాగా... యువతి కోసం కుటుంబసభ్యులు గాలించగా.. ఆచూకీ దొరికింది. ఆ నలుగురితో కలిసి యువతి ని పట్టుకొని ఇంటికి తీసుకువచ్చారు. కాగా.. తర్వాత.. ఆ నలుగురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని కుటుంబసభ్యులు ఆమెను ప్రశ్నించారు. దీంతో.. ఎవరిని ఎంచుకోవాలో యువతికి అర్థం కాలేదు.

దీంతో.. నలుగురి పేర్లు చీటీ రాసి డ్రా తీయగా.. ఎవరి పేరు వస్తే వారితో యువతి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అంబేడ్కర్ నగర్ లోని అజిమ్ నగర్ కు చెందిన యువతి ఇటీవల నలుగురు యువకులతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. వీరంతా బంధువుల ఇల్లల్లో తలదాచుకున్నారు. ఈ విషయం తెలిసుకున్న యువతి కుటుంబస్యులు వారిని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు.

ఈ విషయంలో పంచాయతీ జోక్యం చేసుకొని కేసు పరిష్కరించడం గమనార్హం. నలుగురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావనే ప్రశ్నకు యువతి బాగా తికమకపడిపోయింది. దీంతో పంచాయతీ పెద్దలు చిటీలు వేసి వరుడిని ఎంపిక చేశారు. నలుగురి పేర్లు రాసి ఓ చిన్నారితో డ్రా తీయించారు. చిన్నారి తీసిన చీటిలో పేరున్న యువకుడితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు
విజయ సంకల్ప యాత్రలో మోదీ స్పీచ్ కి దద్దరిల్లిన సభ | PM Narendra Modi Speech | Asianet News Telugu