చిన్న పొరపాటుతో.. కొడుకు, చెల్లెలి ప్రాణం తీసింది..

Published : Feb 25, 2021, 04:42 PM IST
చిన్న పొరపాటుతో.. కొడుకు, చెల్లెలి ప్రాణం తీసింది..

సారాంశం

ఎవరు, ఎప్పుడు, ఎలా చనిపోతారనేది మన చేతుల్లో ఉండదు. చావాలనుకున్నా ఆయుష్షు ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాణం పోదు. అయితే అనుకోకుండా చావు కబలిస్తే మాత్రం అది తీరని వేదనగా మారుతుంది. అలాంటి ఓ ఘటనే కేరళలో జరిగింది.

ఎవరు, ఎప్పుడు, ఎలా చనిపోతారనేది మన చేతుల్లో ఉండదు. చావాలనుకున్నా ఆయుష్షు ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాణం పోదు. అయితే అనుకోకుండా చావు కబలిస్తే మాత్రం అది తీరని వేదనగా మారుతుంది. అలాంటి ఓ ఘటనే కేరళలో జరిగింది.

ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించిన మహిళ బతికి, అభం శుభం ఎరుగని ఐదేళ్ల చిన్నారి, ఎంతో భవిష్యత్ ఉన్న 19 యేళ్ల చెల్లి అనుకోకండా మరణించారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మహిళ కటకటాలపాలైంది. 

వివరాల్లోకి వెడితే... కేరళకు చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఎలుకల మందు తాగి చనిపోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఎలుకల మందు తెచ్చుకొని ఐస్‌క్రీమ్‌లో కలుపుకుని తాగింది. అయితే ఆ ఐస్ క్రీం పూర్తిగా తినలేదు. అది పడేయడం మర్చిపోయింది. 

అయితే ఆ ఐస్ క్రీంలో విషం ఉన్న సంగతి తెలియని ఆ మహిళ ఐదేళ్ల కుమారుడు, ఆమె 19యేళ్ల సోదరి ఐస్ క్రీం తినేశారు. అయితే ఈ విషంతో వీళ్లిద్దరూ చనిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆత్మహత్య చేసుకోవాలని విషం కలుపుకున్న యువతి మత్రం బతికింది. 

విషయం తెలిసి లబోదిబో మన్నది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu