తమిళనాడు విద్యార్ధులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 9 నుండి 11 తరగతుల విద్యార్ధులను ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయనున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
చెన్నై:తమిళనాడు విద్యార్ధులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 9 నుండి 11 తరగతుల విద్యార్ధులను ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయనున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. 9, 10., 11 తరగతుల విద్యార్ధులకు ఎలాంటి పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేయనున్నట్టుగా ఆ రాష్ట్ర సీఎం పళని స్వామి ప్రకటించారు.
ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఇవాళ ఈ మేరకు ప్రకటన చేశారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా అధికారులు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేయనున్నారు.12వ తరగతి విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మే 3వ తేదీ నుండి మే 21 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
గత ఏడాది కూడ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.