అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగాలు పోతాయా ? పీఎస్ యూలో ఉద్యోగాల తొలగింపుపై రాహుల్ గాంధీ ఫైర్

Published : Jun 18, 2023, 01:02 PM IST
అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగాలు పోతాయా ? పీఎస్ యూలో ఉద్యోగాల తొలగింపుపై రాహుల్ గాంధీ ఫైర్

సారాంశం

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు పీఎస్ యూల్లో రెండు లక్షల ఉద్యోగులను తొలగించారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగాలు పోతాయా అని ఆయన ప్రశ్నించారు. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పీఎస్ యూల నుంచి రెండు లక్షల ఉద్యోగాలను తొలగించిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. కొందరు క్రోనీ క్యాపిటలిస్ట్ మిత్రుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం యువత ఆశలను తుంగలో తొక్కుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి గర్వకారణమని, అవి ప్రభుత్వ ప్రాధాన్యత కాదని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగాలు తగ్గుతాయా అని ప్రశ్నించారు.

వీడీ సావర్కర్ దేశభక్తుడు.. ఆయన పాఠాలను సిలబస్ నుంచి తొలగించడం దురదృష్టకరం - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

‘‘దేశంలోని పీఎస్ యూల్లో ఉద్యోగాలు 2014లో 16.9 లక్షలు ఉండగా.. అవి 2022 నాటికి 14.6 లక్షలకు తగ్గాయి. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగాలు తగ్గుతాయా? బీఎస్ఎన్ఎల్లో 1,81,127 ఉద్యోగాలు పోయాయి. సెయిల్ లో 61,928; ఎంటీఎన్ఎల్లో 34,997; ఎస్ఈసీఎల్ లో 29,140; ఎఫ్సీఐలో 28,063; ఓఎన్జీసీలో 21,120’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఉద్యోగాల హామీలపై రాహుల్ గాంధీ ఫైర్ 
యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, ఉపాధి కల్పించడానికి బదులు రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం తొలగించిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని తప్పుడు హామీలు ఇచ్చిన వారు ఉద్యోగాలను పెంచడానికి బదులు 2 లక్షలకు పైగా తొలగించారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘దీనికి తోడు ఈ సంస్థల్లో కాంట్రాక్టు నియామకాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను పెంచడం రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ హక్కును హరించడానికి మార్గం కాదా? ఈ సంస్థలను ప్రైవేటీకరించే కుట్ర ఇదేనా? పారిశ్రామిక వేత్తల రుణాలు మాఫీ, పీఎస్ యూల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు తొలగింపు! ఇది ఎలాంటి ‘అమృత్ కల్’'ఇది నిజంగా అమృత్ కాల్ అయితే ఉద్యోగాలు ఎందుకు కనుమరుగవుతున్నాయి’’ అని ఆయన ప్రశ్నించారు.

పొట్టి దుస్తులు ధరించి లోపలికి రావొద్దు.. అలా చేస్తే బయటి నుంచే నమస్కరించండి - షిమ్లాలోని ప్రసిద్ధ జైన దేవాలయం

పీఎస్ యూలకు ‘సరైన వాతావరణాన్ని’ అందించాలని కాంగ్రెస్ నాయకుడు నొక్కిచెప్పారు. ప్రభుత్వ మద్దతు లభిస్తే, అవి ఆర్థిక వ్యవస్థ, ఉపాధి రెండింటినీ పెంచగలవని అన్నారు. ‘‘భారత పీఎస్ యూ లకు ప్రభుత్వం నుంచి సరైన వాతావరణం, మద్దతు లభిస్తే ఆర్థిక వ్యవస్థ, ఉపాధి రెండింటినీ పెంచుకోగలుగుతాయి. పీఎస్ యూలు దేశం, దేశ ప్రజల ఆస్తి. వాటిని ప్రోత్సహించాలి. తద్వారా అవి భారతదేశ పురోగతి మార్గాన్ని బలోపేతం చేస్తాయి’’ ఆయన ట్వీట్ చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu