కూర రుచిగా లేదన్నాడని.. భర్త తల పగలకొట్టిన భార్య..!

By telugu news teamFirst Published Sep 8, 2021, 8:45 AM IST
Highlights

 కోపోద్రిక్తురాలైన బిందియా భర్త దినేశ్ పై ఇనుప రాడ్డుతో దాడి చేసింది. దీంతో.. అతడి తలకు తీవ్ర గాయమైంది.

భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అయితే.. ఆ మాత్రానికే.. ఓ మహిళ భర్త పట్ల దారుణంగా ప్రవర్తించింది.  కూర బాలేదు అని చెప్పాడని.. ఓ మహిళ ఏకంగా భర్త తల పగలకొట్టింది. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హర్యానా రాష్ట్రం హిసార్ జిల్లా బార్వాలా పట్టణంలో దినేశ్, బిందియా దంపతులు నివసిస్తున్నారు. ప్రతిరోజూలాగే భర్త కోసం ఆమె వంట చేసింది. అయితే.. కూరలో ఉప్పు తక్కువైందని భావించిన దినేశ్(40).. ఈ విషయాన్ని భార్యతో చెప్పాడు. దీంతో.. భోజనం అంత రుచిగా లేదని చెప్పాడు. దీంతో.. వారి మధ్య వాదన మొదలైంది.

దీంతో.. కోపోద్రిక్తురాలైన బిందియా భర్త దినేశ్ పై ఇనుప రాడ్డుతో దాడి చేసింది. దీంతో.. అతడి తలకు తీవ్ర గాయమైంది. ఆ గొడవను గమనించిన పొరుగింటి వ్యక్తి అక్కడకు చేరుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించాడు. అనంతరం ఈ ఘటనపైద దినేశ్ పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. తమ మధ్య తరచూ ఇలాంటి గొడవలే జరుగుతున్నాయని .. బాధితుడు చెప్పడం గమనార్హం. 

click me!