మీకెందుకు కోపం?: ఢిల్లీ బడ్జెట్ పై ప్రధానికి అరవింద్ కేజ్రీవాల్ లేఖ

By Mahesh RajamoniFirst Published Mar 21, 2023, 10:30 AM IST
Highlights

New Delhi: "దేశ 75 ఏళ్ల చరిత్రలో రాష్ట్ర బడ్జెట్ ను నిలిపివేయడం ఇదే తొలిసారి. ఢిల్లీ ప్రజలపై మీకెందుకు కోపం" అని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌విద్ కేజ్రీవాల్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు చేతులు జోడించి వేడుకుంటున్నారనీ, దయచేసి త‌మ బడ్జెట్ ను ఆమోదించండని ఆయ‌న పేర్కొన్నారు.
 

Arvind Kejriwal Writes To PM Over Delhi Budget: కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు, ఢిల్లీ ఆప్ ప్ర‌భుత్వాల మ‌ధ్య మ‌రోసారి విభేదాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. రాష్ట్ర బ‌డ్జెట్ విష‌యంలో కేంద్రం, లెఫ్టినెంట్ గ‌వర్న‌ర్ తీరును త‌ప్పుబ‌డుతూ ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ నాయ‌కుడు అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీ బడ్జెట్ ను ఆపొద్దని తాను రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. "దేశ 75 ఏళ్ల చరిత్రలో రాష్ట్ర బడ్జెట్ ను నిలిపివేయడం ఇదే తొలిసారి. ఢిల్లీ ప్రజలపై మీకెందుకు కోపం" అని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌విద్ కేజ్రీవాల్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు చేతులు జోడించి వేడుకుంటున్నారనీ, దయచేసి త‌మ బడ్జెట్ ను ఆమోదించండని ఆయ‌న ప్ర‌స్తావించారు. 

2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రకటనలు, పబ్లిసిటీ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపాదిత వ్యయంపై ప్రశ్నలతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన వార్షిక బడ్జెట్ ను విధానసభలో ప్రవేశపెట్టకుండా దాదాపు నిలిపివేసిన ప‌రిస్థితుల‌ను క‌ల్పించింది. "ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతిపాదిత బడ్జెట్ పై పరిపాలనా స్వభావానికి సంబంధించిన కొన్ని ఆందోళనలను లేవనెత్తారు. జాతీయ రాజధాని ప్రాంత ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, తదుపరి చర్యలు తీసుకోవడానికి ఈ ఆందోళనలను పరిష్కరించడానికి బడ్జెట్ ను తిరిగి సమర్పించాలని ఎంహెచ్ఎ మార్చి 17, 2023 నాటి లేఖలో జీఎన్సీడీని అభ్యర్థించింది. గత నాలుగు రోజులుగా జీఎన్సీటీడీ నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం" అని ఎంహెచ్ఏ ఒక ప్రకటనలో తెలిపింది.

లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేవ‌నెత్తిన ఆందోళనలను పరిష్కరించిన తర్వాత బడ్జెట్‌ను మళ్లీ పంపాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. అయితే, ప్రకటనలు, పబ్లిసిటీ కోసం బడ్జెట్ కేటాయింపులు గత ఏడాది మాదిరిగానే ఉన్నాయని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దాదాపు 40 రెట్లు అధికంగా ఖర్చు చేయాలని ప్రతిపాదించినట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఎంహెచ్ఏ లేవనెత్తిన ఆందోళనలు అసంబద్ధమైనవనీ, బడ్జెట్ ను పక్కదారి పట్టించేందుకే ఇలా చేసినట్లు కనిపిస్తోందని ఢిల్లీ ఆర్థిక మంత్రి కైలాష్ గెహ్లాట్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టాల్సిన 2023-24 ప్రభుత్వ బడ్జెట్ ను హోం మంత్రిత్వ శాఖ నిలిపివేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం ఆరోపించడంతో వివిధ అంశాలపై విభేదిస్తున్న కేంద్రం, ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ కొత్త గొడవకు దిగాయి.

 

We have responded to MHA’s concerns and submitted the file back to Delhil’s LG, after CM’s approval, at 9pm today. It’s very clear that the concerns raised by MHA are irrelevant & seemingly done only to scuttle Delhi govt's budget for next year. Sad day for Indian democracy. 2/2 https://t.co/y17JecNeEY

— Kailash Gahlot (@kgahlot)


 

click me!