శ‌త్రుత్వం కాదు సంక్షేమ‌మే భార‌త్ ను ముందుకు న‌డిపిస్తుంది : ప్ర‌తిప‌క్షాలపై ప్ర‌ధాని మోడీ కీల‌క వ్యాఖ్యలు

Published : Jul 19, 2023, 01:16 AM IST
శ‌త్రుత్వం కాదు సంక్షేమ‌మే భార‌త్ ను ముందుకు న‌డిపిస్తుంది : ప్ర‌తిప‌క్షాలపై ప్ర‌ధాని మోడీ కీల‌క వ్యాఖ్యలు

సారాంశం

New Delhi: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రాంతీయ ఆకాంక్షలకు నిలయమనీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లతో అధికార కూటమి మ‌ళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తాము దేశం, దేశ భ‌ద్ర‌త, దేశ పురోగ‌తి, ప్రజల సాధికారతకు అధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌ని చెప్పారు. ఎన్డీయే అంటే ‘‘న్యూ ఇండియా  డెవలప్‌మెంట్ ఆస్పిరేషన్’’గా ప్రధాని అభివర్ణించారు.  

Prime Minister Narendra Modi: శ‌త్రుత్వం కాదు సంక్షేమ‌మే భార‌త్ ను ముందుకు న‌డిపిస్తుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఎన్డీయేను ప్రజలు సానుకూలంగా చూస్తున్నారనీ, అభివృద్దే తమ ఎజెండా, రోడ్ మ్యాప్ అని చెప్పారు. భారతదేశం సంకీర్ణాల సుదీర్ఘ సంప్రదాయాన్ని కలిగి ఉన్నప్పటికీ, ప్రతికూలతతో ఏర్పడినవి ఎన్నడూ విజయవంతం కాలేదని మోడీ అన్నారు. ఎన్డీయేలో ఏ పార్టీ పెద్దదో, చిన్నదో కాదని, 2014, 2019లో బీజేపీకి మెజారిటీ వచ్చిందని, కానీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కూటమి అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్ కే అద్వానీల వారసత్వమనీ, ఎన్డీయే ఏర్పాటుకు సహకరించిన ప్రకాశ్ సింగ్ బాదల్, బాలాసాహెబ్ థాక్రే, అజిత్ సింగ్, శరద్ యాదవ్ వంటి నేతలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సమయానుకూలమైన కూటమి అనీ, జాతీయ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ కూటమి ప్రయత్నిస్తుందని ప్రధాని ప్రశంసించారు. భారత్ ను ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అలాగే, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రాంతీయ ఆకాంక్షలకు నిలయమనీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లతో అధికార కూటమి మ‌ళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ అన్నారు. తాము దేశం, దేశ భ‌ద్ర‌త, దేశ పురోగ‌తి, ప్రజల సాధికారతకు అధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌ని చెప్పారు. ఎన్డీయే అంటే ‘‘న్యూ ఇండియా  డెవలప్‌మెంట్ ఆస్పిరేషన్’’గా ప్రధాని అభివర్ణించారు.

1990వ దశకంలో కాంగ్రెస్ పార్టీ పొత్తులు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, కానీ దేశాన్ని సర్వనాశనం చేసిందని, పొత్తులు తెగిపోయాయని ఆయన అన్నారు. ఎన్డీయే 1998లో అధికారం కోసమో, ఎవరినో గద్దె దించడమో చేయలేదు. సుస్థిర ప్రభుత్వాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమనీ, అందులో విజయం సాధించామని, తొమ్మిదేళ్లలో దేశ గమనాన్ని మార్చామని, దేశాన్ని వేగవంతమైన అభివృద్ధి పథంలో నడిపించామని చెప్పారు. ఈ సమావేశంలో అనేక సూచనలు వచ్చాయని, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, తన బృందం వాటిని పరిగణనలోకి తీసుకుని సమాధానాలతో వస్తారని ఆయన చెప్పారు. "ఎన్డీయే అధికారం కోసం ఏర్పడింది కాదు.. ఎవరికీ వ్యతిరేకంగా ఏర్పడింది కాదు.. ఎవరినీ అధికారం నుంచి దింపేందుకు ఏర్పాటైనది కాదు.. దేశానికి సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించడానికి ఎన్డీయే ఏర్పడిందని" ప్రధాని మోడీ అన్నారు.

సుస్థిర ప్రభుత్వం దేశ దిశను మార్చగలదనీ, అటల్‌జీ పాలనలో దీనిని చూశామని, గత 9 ఏళ్లలో కూడా దీనిని చూశామని ఆయన అన్నారు. ఎన్డీయే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సానుకూల, నిర్మాణాత్మక రాజకీయాలు చేసిందని ప్రధాని మోడీ అన్నారు. "మేము ప్రభుత్వాలను వ్యతిరేకించాము, మేము వారి అవినీతిని బహిర్గతం చేసాము, కానీ మా బాధ్యతల నుండి ఎప్పుడూ తప్పుకోలేదు" అని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు మేం ఎప్పుడూ విదేశీ సాయం కోరలేదంటూ కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌ గాంధీపై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Lactobacillus Bulgaricus: బ్యాక్టీరియా కూడా రాష్ట్ర గుర్తేనా? కేరళ రికార్డ్ | Asianet News Telugu
Free Gas Cylinder: దీపావళికి, హోలీకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న ప్రభుత్వం