అలాంటి పునాదులపై ధృఢంగా నిలపడే సమాజాన్ని నిర్మించాం.. ప్రధాని మోదీ

Published : Jan 20, 2022, 03:08 PM IST
అలాంటి పునాదులపై ధృఢంగా నిలపడే సమాజాన్ని నిర్మించాం.. ప్రధాని మోదీ

సారాంశం

సామాజిక రుగ్మతను పూర్తిగా నిర్మూలించి భారత్​ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కృషి చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వివక్షకు ఏ మాత్రం తావు లేని సమాజ నిర్మాణం జరుగుతోందని, భారత్​ ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తుందని ఉద్ఘాటించారు.

దేశంలో వివక్ష లేని వ్యవస్థను సృష్టించామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గురువారం ఆయన ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కి ఓర్ కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సామాజిక రుగ్మతను పూర్తిగా నిర్మూలించి భారత్​ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కృషి చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వివక్షకు ఏ మాత్రం తావు లేని సమాజ నిర్మాణం జరుగుతోందని, భారత్​ ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తుందని ఉద్ఘాటించారు.

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ సందర్భంగా.. ఏడాది పొడవునా బ్రహ్మకుమారీస్​ నిర్వహించే ఈ కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టారు. 30కిపైగా క్యాంపెయిన్లు, 15 వేలకుపైగా వివిధ కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి.

 

బ్రహ్మకుమారీస్​ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 7 కార్యక్రమాలను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఆ ఏడు కార్యక్రమాలు.. మై ఇండియా హెల్దీ ఇండియా, ఆత్మనిర్భర్​ భారత్​: సెల్ఫ్​ రిలయంట్​ ఫార్మర్స్​, విమెన్​: ఫ్లాగ్​ బేరర్స్​ ఆఫ్​ ఇండియా, పవర్​ ఆఫ్​ పీస్​ బస్​ క్యాంపెయిన్​, అందేఖా భారత్​ సైకిల్​ ర్యాలీ, యునైటెడ్​ ఇండియా మోటార్​ బైక్​ క్యాంపెయిన్​, స్వచ్ఛ భారత్​ అభియాన్​లో భాగంగా చేపట్టే గ్రీన్​ ఇనిషియేటివ్స్​.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Medical Shop: దేశ‌వ్యాప్తంగా మెడిక‌ల్ దుకాణాల బంద్‌.. కార‌ణం ఏంటంటే.?
Snake: కోబ్రా కాటేసినా నో టెన్షన్.. ఈ కన్నీళ్లు మీ ప్రాణాలు కాపాడతాయి.. అసలు మ్యాటర్ ఇదీ!