కేంద్రమంత్రి కారును ఢీకొన్న బస్సు...లేచిన వేళ బాగుందన్న మంత్రి

sivanagaprasad kodati |  
Published : Nov 09, 2018, 12:59 PM IST
కేంద్రమంత్రి కారును ఢీకొన్న బస్సు...లేచిన వేళ బాగుందన్న మంత్రి

సారాంశం

కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి బాబుల్ సుప్రియో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. శుక్రవారం ఉదయం ఆయన ఢిల్లీలోనిన తన నివాసం నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతూ.. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఓ ఫ్లైఓవర్‌ గుండా ప్రయాణిస్తున్నారు..

కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి బాబుల్ సుప్రియో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. శుక్రవారం ఉదయం ఆయన ఢిల్లీలోనిన తన నివాసం నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతూ.. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఓ ఫ్లైఓవర్‌ గుండా ప్రయాణిస్తున్నారు..

ఈ సమయంలో మంత్రి కారును వేగంగా వచ్చిన వోల్వో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బాబుల్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కాన్వాయ్‌ని అనుసరిస్తున్న భద్రతా సిబ్బంది వెంటనే మంత్రిని మరో కారులో విమానాశ్రయానికి పంపారు.

ప్రమాదం తర్వాత మీడియాతో మాట్లాడిన బాబుల్ సుప్రియో.. కారు డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించకపోయి ఉంటే.. తాము బయటకు విసిరివేయబడి ఉండేవాళ్లమని అన్నారు.. అదృష్టం బాగుండి బతికిపోయానని ట్వీట్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు