వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మానవత్వానికే మాయని మచ్చలా మిగిలిన ఓ ఘటన ఓడిశా రాష్ట్రంలో వెలుగుచూసింది. కోడలే మానవత్వాన్ని మరచి 75 ఏళ్ల అత్తను రోడ్డుపై ఈడ్చుకువెళ్లిన దారుణ ఘటన ఓడిశా రాష్ట్రంలోని బర్గాడ్ జిల్లా తాళపల్లి గ్రామంలో జరిగింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో భూవివాదం వల్ల అత్తను కోడలు అత్యంత దారుణంగా రోడ్డుపై ఈడ్చుకువచ్చిందని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. నిందితురాలైన బాలామతిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.