కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా విషయంలో పాక్ వైఖరిని తప్పుబట్టిన విశ్వహిందూ పరిషత్

Published : Nov 06, 2020, 05:04 PM ISTUpdated : Nov 06, 2020, 05:05 PM IST
కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా విషయంలో పాక్ వైఖరిని తప్పుబట్టిన విశ్వహిందూ పరిషత్

సారాంశం

ప్రపంచంలోనే అత్యంత ప్రాశస్త్యమైన గురుద్వారా ను ప్రబంధక్ కమిటీ పరిపాలన నుండి తొలగించి దానిని వేరే సంస్థకు, అందునా ముస్లిం మాత విశ్వాసాన్ని పాటించే సంస్థకు అప్పగించడం పూర్తిగా అనైతికమని, దీనిని భారత ప్రభుత్వం కూడా వ్యతిరేకించిందని, ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ ఈ విషయంలో సంపూర్ణ మద్దతును తెలియజేయడమే కాకుండా ఈ పోరులో భాగస్వాములమవుతున్నామని పేర్కొన్నారు. 

పాకిస్తాన్ లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా  పరిపాలనా  బాధ్యతలను పాకిస్తాన్ సిక్కు గురుద్వారా  ప్రబంధక్ కమిటీ నుండి తీసుకొని స్థానిక ఇవాక్యు ట్రస్ట్ బోర్డు కు అప్పగించదాన్ని విశ్వ హిందూ పరిషద్ తీవ్రంగా ఖండించింది. 

గురుద్వారా ప్రబంధక్ కమిటీ సైతం పరిపాలనలో భాగస్వాములేనని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ....  కొత్తగా బాధ్యతలను స్వీకరించిన బోర్డులో ఒక్క సిక్కు కూడా లేకపోవడం, ప్రభుత్వ అసలు సిసలు ఉద్దేశాన్ని బయటపెడుతుందని వారు ఆరోపించారు. 

ప్రపంచంలోనే అత్యంత ప్రాశస్త్యమైన గురుద్వారా ను ప్రబంధక్ కమిటీ పరిపాలన నుండి తొలగించి దానిని వేరే సంస్థకు, అందునా ముస్లిం మాత విశ్వాసాన్ని పాటించే సంస్థకు అప్పగించడం పూర్తిగా అనైతికమని, దీనిని భారత ప్రభుత్వం కూడా వ్యతిరేకించిందని, ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ ఈ విషయంలో సంపూర్ణ మద్దతును తెలియజేయడమే కాకుండా ఈ పోరులో భాగస్వాములమవుతున్నామని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Free Scooty : కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ.. ఈ సూపర్ స్కీమ్ ఫుల్ డిటెయిల్స్
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి